దిల్రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం దసరానాడు అంటే గురువారంనాడు లాంఛనంగా ప్రారంభం కానుంది. మల్టీస్టారర్ చిత్రాలు రావడంలేదని ఇండస్ట్రీలో ప్రముఖులు, ప్రజలు గొడవలు చేస్తున్న తరుణంలో ఇటువంటి కథాంశంతో చిత్రం రావడం విశేషమే. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఇటువంటి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉందని దిల్రాజు అన్నారు. కొత్తబంగారులోకం చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శ్రీనగర్కాలనీలోని దిల్రాజు కార్యాలయంలో జరగనుంది. ఆ కార్యాలయానికి వెళ్లే రోడ్డు చుట్టుపక్కలా అలంకరిస్తున్నారు.ఈ ప్రారంభోత్సవానికి దాసరి నారాయణరావు, రామ్చరణ్, అల్లు అర్జున్, శ్రీనువైట్లతో పాటు పలువురు సినీప్రముఖులు హాజరుకానున్నారు. శ్రీకాంత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి జరగనుంది. మహేష్ బాబు సరసన సమంత నటించనుంది. వెంకటేష్ సరసన త్రిష నటించనున్నట్లు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.